యాప్నగరం

మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన షరీఫ్

పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది

TNN 5 Jan 2017, 7:30 pm
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హన్ వనీనిపై ప్రశంసలు గుప్పించారు. వనీ శక్తివంతుడు, ప్రజాకర్షణ ఉన్న నాయకుడంటూ ప్రశంసించారు. కశ్మీర్‌ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గత అక్టోబర్‌లోనూ షరీఫ్ వనీని పొగుడుతూ మాట్లాడారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌కు ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనేందుకు ఇదే రుజువని తెలిపింది.
Samayam Telugu pakistan pm nawaz sharif again praises burhan wani
మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన షరీఫ్


గతేడాది సెప్టెంబర్ 21న ఐరాసలో ప్రసంగించిన సందర్భంగానూ షరీఫ్ వనీని ప్రశంసించారు. భారత సైన్యం కాల్పుల్లో మరణించిన వనీని ఆయన యువనాయకుడిగా అభివర్ణించారు. ఐరాసలో పాక్ ప్రధాని మాట్లాడిన తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.

70 ఏళ్ల క్రితం కశ్మీర్ ప్రజలకు మాట ఇచ్చామని, ఇది కేవలం పాక్ ఇచ్చిన మాట మాత్రమే కాదు.. ఐక్యరాజ్యసమితితోపాటు భారత్ కూడా కశ్మీర్ ప్రజల హక్కులను, స్వీయ నిర్ణయాధికారాన్ని గుర్తిస్తామని మాట ఇచ్చిందన్నారు. కశ్మీర్‌ ప్రజలు తమ హక్కుల కోసం చేసే పోరాటానికి తాము ఎప్పుడు మద్దతునిస్తామన్నారు.

మరో సదస్సులో షరీఫ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల ఏరివేత కోసం జర్బ్ ఏ అజబ్ తరహాలోనే జర్బ్ ఏ ఖలమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదంతో పోరాడతామన్నారు. నేషనల్ హిస్టరీ అండ్ లిటరరీ హెరిటేజ్ డివిజన్‌కు రూ.500 మిలియన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.