వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల వివాదం మరోసారి భారత్- పాక్ల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న తమ గ్రామాలపై భారత సైనికులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారని పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి సమాధానం ఇవ్వాలంటూ ఇస్లామాబాద్లోని భారత రాయబారికి పాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే కాల్పులను విరమించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
జూన్ 10, 12 తేదీల్లో ఎల్వోసీ వెంబడి పాకిస్థాన్లోని సచిరికోట్, హాట్స్పైరింగ్ సెక్టార్లపైకి భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పదేపదే ఉల్లంఘిస్తోంది, దీని వివరణ ఇవ్వాలంటూ డిప్యూటీ కమిషనర్ జేపీ సింగ్కు సార్క్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైజల్ సమన్లు జారీచేశారని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పౌరులు చనిపోయిన విషయాన్ని కూడా సైన్యం నిర్ధరించిందని, భారత్ చర్యను మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.
అయితే వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచూ ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. 2016లో 450 సార్లు కాల్పులకు తెగబడినట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్లోనూ భారత్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్లో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ భారత సైనికులపై కాల్పులకు తెగబడి అత్యంత పాశవికంగా వ్యవహరించిన విషయాన్ని దేశం ఇప్పట్లో మరిచిపోదు.
జూన్ 10, 12 తేదీల్లో ఎల్వోసీ వెంబడి పాకిస్థాన్లోని సచిరికోట్, హాట్స్పైరింగ్ సెక్టార్లపైకి భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పదేపదే ఉల్లంఘిస్తోంది, దీని వివరణ ఇవ్వాలంటూ డిప్యూటీ కమిషనర్ జేపీ సింగ్కు సార్క్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైజల్ సమన్లు జారీచేశారని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పౌరులు చనిపోయిన విషయాన్ని కూడా సైన్యం నిర్ధరించిందని, భారత్ చర్యను మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.
అయితే వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచూ ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. 2016లో 450 సార్లు కాల్పులకు తెగబడినట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్లోనూ భారత్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్లో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ భారత సైనికులపై కాల్పులకు తెగబడి అత్యంత పాశవికంగా వ్యవహరించిన విషయాన్ని దేశం ఇప్పట్లో మరిచిపోదు.