యాప్నగరం

భారత జవాన్‌ కిరాతక హత్య.. పాక్ సరిహద్దుల్లో హై అలర్ట్

బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్థాన్ సైన్యం అతి కిరాతకంగా హతమార్చింది. గొంతు కోసి, శరీరంలోకి బుల్లెట్లు దింపి పాశవికంగా పొట్టనబెట్టుకుంది.

Samayam Telugu 19 Sep 2018, 4:18 pm
పాకిస్థాన్ బలగాలు బీఎస్‌ఎఫ్ జవాను గొంతు కోసి కిరాతకంగా హతమార్చాయి. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఘటన చోటు చేసుకుంది. భారత జవాన్ హత్య ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. రామ్‌గఢ్ సెక్టార్లో మంగళవారం పాక్ బలగాలు భారత జవాన్‌ను చంపేశాయి. ఈ ఘటనతో అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ విషయమై బీఎస్ఎఫ్ పాకిస్థాన్ రేంజర్లకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu bsf1


పాక్ బలగాలు హతమార్చిన జవాన్‌ను హెడ్ కానిస్టేబుల్ నరేందర్ కుమార్‌గా గుర్తించారు. అతడి శరీరంపై మూడు బుల్లెట్ గాయాలను కూడా గుర్తించారు. ముందుగా బీఎస్ఎఫ్ జనవాన్ కనిపించకుండా పోయాడని భావించారు. దీంతో అతడి కోసం సంయుక్తంగా వెతుకులాట ప్రారంభిద్దామని పాకిస్థాన్ రేంజర్లను బీఎస్ఎఫ్ కోరింది. కానీ వారు సాకులు చెప్పి సహకరించకుండా తప్పించుకున్నారు. దీంతో సూర్యాస్తమయం అయ్యేంత వరకూ వేచి ఉన్న బీఎస్ఎఫ్ బలగాలు ‘రిస్కీ ఆపరేషన్’ చేపట్టి జవాన్ మృతదేహాన్ని వెనక్కి తీసుకొచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.