యాప్నగరం

ఆయుధాలతో భారత భూభాగంలోకి పాక్ డ్రోన్.. సకాలంలో గుర్తించి కూల్చేసిన సైన్యం

ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో తలమునకలై ఉంటే.. దాయాది పాకిస్థాన్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడంలేదు. నిరంతరం ఉగ్రవాదులను ఎగదోయడం సహా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది.

Samayam Telugu 21 Jun 2020, 12:08 pm
సరిహద్దుల్లో దాయాది కుట్రలను భారత సైనికులు సమర్ధంగా ఎదుర్కొంటున్నారు. నిరంతరం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్.. సైనిక పోస్టులపై తరుచూ దాడిచేస్తోంది. తాజాగా, పాకిస్థాన్‌ మరో దుస్సాహసానికి ప్రయత్నించగా.. దాని ప్రయత్నాలు భారత సైనికులు తిప్పికొట్టారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్న పాకిస్థాన్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ బలగాలు కూల్చివేశాయి. శనివారం తెల్లవారుజామున 5:10 గంటల ప్రాంతంలో రథువా గ్రామంలోని పన్సార్ బోర్డర్ ఔట్ పోస్ట్ వద్ద డ్రోన్‌ కదలికలు గుర్తించిన భారత సైన్యం.. దాన్ని కూల్చివేసింది.
Samayam Telugu సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కూల్చేసిన భారత్
pakistani drone shot down by BSF


Read Also: దేశవ్యాప్తంగా ఖగోళ అద్భుతం.. తిలకించేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు

మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరిపి.. భారత భూభాగంలో 250 మీటర్ల లోపల దాన్ని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. చైనాలో తయారుచేసిన ఈ డ్రోన్‌లో అత్యాధునిక రైఫిల్‌, 60 రౌండ్ల బుల్లెట్లు, ఏడు చైనా గ్రనేడ్లు, 2 జీపీఎస్‌లను గుర్తించారు. పాక్ ఏజెంట్లకు సరఫరా చేసేందుకు వీటిని డ్రోన్‌లో తరలించినట్లు అధికారులు భావిస్తున్నారు.

Read Also: సరిహద్దుల్లో ఘర్షణ.. గాల్వన్‌ వద్ద భారత్ పట్టునిలుపుకునే ప్రయత్నం

మరోవైపు, పూంచ్ సెక్టార్‌లోని బాలాకోట్ సమీపంలో పాక్ బలగాలు ఆదివారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డాయి. పాక్ సైన్యం కాల్పులను ఆర్మీ దీటుగా తిప్పికొట్టింది. శనివారం ఉదయం కూడా హిరాన్‌గర్ సెక్టార్‌లోని బబియా పోస్ట్‌పై పాక్ కాల్పులకు పాల్పడింది. కాగా, శ్రీనగర్‌లో భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. జాదిబాల్‌లో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం... ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

Read Also: ‘ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా’.. ప్రధాని మోదీ యోగా దినోత్సవం నినాదం
ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి.. నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
Read Also: దేశంలో కరోనాా విజృంభణ: నిన్న ఒక్క రోజే 15వేలకుపైగా కేసులు.. 4 లక్షలు దాటిన కరోనా కేసులు
కుల్గాం జిల్లాలో శనివారం భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ముష్కరులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో లిఖ్డిపొరాలో భారత బలగాలు గాలింపు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో.. భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.