పాకిస్థానీ అధికారి ప్రాణాలు కాపాడటానికి ఢిల్లీ పోలీసులు తీసుకున్న చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. భారత్లో పాకిస్థాన్ హై కమిషనర్గా పని చేస్తున్న ఓ అధికారి శనివారం (డిసెంబర్ 23) ఉదయం రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును హర్యాణా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జై.. ఆయన అందులో చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, కారులో నుంచి అధికారిని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసుల చొరవను బాధిత పాక్ అధికారితో పాటు పలువురు ప్రశంసించారు.
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, కారులో నుంచి అధికారిని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసుల చొరవను బాధిత పాక్ అధికారితో పాటు పలువురు ప్రశంసించారు.