యాప్నగరం

భారత్‌ భూభాగంలోకి పాక్ డ్రోన్.. కూల్చేసిన సైనికులు

అనుమానాస్పందంగా భారత్ భుభూగాంలోకి పాక్ డ్రోన్ కదిలింది. దీంతో పాక్ డ్రోన్‌ను భారత్ భద్రతా అధికారులు కూల్చివేశారు. ఐతే డ్రోన్‌లో ఆయుధాలను పెట్టి భారత్ వైపు డ్రోన్‌ రావడంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 20 Jun 2020, 11:03 am
ఓ వైపు భారత్‌పై చైనా చెలరేగిపోతుంటే.. మరోవైపు దాయాది దేశం పాక్ కూడా కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు గుర్తించాయి. గూడఛర్య డ్రోన్‌లో ఆయుధాలను పంపి ఎల్‌వోసీ దాటిస్తోన్ డ్రోన్ కెమెరాను భారత సైనికులు కూల్చి వేశారు. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. అనుమానాస్పందంగా కదులుున్న డ్రోన్ కనిపించింది. దీంతో 19వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది.
Samayam Telugu కూల్చేసిన పాక్ డ్రోన్
pak drone shot down


పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. భారత భూభాగంలో డ్రోన్ పడిపోయింది. పాకిస్తాన్ స్పై డ్రోన్‌ను స్వాధీనం చేసుకొని.. తనిఖీ చేయగా అందులో ఆయుధాల బయటపడ్డాయి. ఐతే డ్రోన్‌లో ఆయుధాలను పెట్టి భారత్ వైపు డ్రోన్‌ను ఎందుకు పంపించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.