గవర్నర్తో పళనిసామి భేటీ
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిసామి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసేందుకు రాజ్ భవన్ చేరుకున్నారు.
Samayam Telugu 16 Feb 2017, 11:52 am
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిసామి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసేందుకు రాజ్ భవన్ చేరుకున్నారు. అనంతరం గవర్నర్ తో భేటీ అయ్యారు. పళనిసామి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే తనను 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బుధవారం గవర్నర్ కు లేఖ అందించిన పళనిసామి..తన చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు.
అయితే ఈ భేటీ అనంతరం పళనిసామి ప్రభుత్వానికి గవర్నర్ పచ్చా జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది.
అటు ఓపీఎస్ వెంట కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలుండటం..పళనిసామికి పూర్తిస్థాయి మద్దతు ఉండటంతో గవర్నర్ కూడా ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారని సమాచారం.
అన్ని కుదిరితే పళనిసామి గురువారం సాయంత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి...బలనిరూపణకు వారం రోజులు గడవు కోరే అవకాశం ఉంది.
అయితే ఈ భేటీ అనంతరం పళనిసామి ప్రభుత్వానికి గవర్నర్ పచ్చా జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది.
అటు ఓపీఎస్ వెంట కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలుండటం..పళనిసామికి పూర్తిస్థాయి మద్దతు ఉండటంతో గవర్నర్ కూడా ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారని సమాచారం.
అన్ని కుదిరితే పళనిసామి గురువారం సాయంత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి...బలనిరూపణకు వారం రోజులు గడవు కోరే అవకాశం ఉంది.