యాప్నగరం

మరోసారి గవర్నర్‌ను కలవనున్న పళనిసామి

మెజార్టీ ఎమ్మెల్యేలు తనవైపు సీఎంగా ప్రమాణస్వీకారానికి అవకాశం ఇవ్వకపోవడంతో

Samayam Telugu 16 Feb 2017, 11:09 am
మెజార్టీ ఎమ్మెల్యేలు తనవైపు సీఎంగా ప్రమాణస్వీకారానికి అవకాశం ఇవ్వకపోవడంతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిసామి గవర్నర్ విద్యాసాగర్ రావును మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30గంటలకు తనను కలిసేందుకు పళనిసామికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.
Samayam Telugu palanisamy to meet governor at 12 30 today
మరోసారి గవర్నర్‌ను కలవనున్న పళనిసామి


తనకు మద్దతుగా 124మంది ఎమ్మెల్యేల మద్దతుందని బుధవారం పళనిసామి గవర్నర్ కు లేఖ అందించారు. దీంతో గురువారం పళనిసామి చేత సీఎంగా ప్రమాణం చేయిస్తారని ప్రచారం జరిగింది. కానీ శశికళ తమను రిసార్ట్స్ లో బంధించారని, కిడ్నాప్ చేశారని ఎస్ఎస్ శరవణన్ కేసు పెట్టడం..గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్నవారిని ఇతరుల బలవంతం మీద బస చేస్తున్నారని భావించిన గవర్నర్...తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు పళనిసామితో చర్చించాక..ఎమ్మెల్యేలతో బలనిరూపణకు అవకాశం ఇస్తారా? తనను సీఎంగా ప్రమాణస్వీకారానికి అనుమతి ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో పళనిసామి మరోసారి గవర్నర్ ను కలువనున్నారు. అయితే పలు అంశాలను సాకుగా చూపి వాయిదా వేస్తూ పోతే రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఓపీఎస్ టీంలో చేరడం ఖాయంగా కనిపిస్తుందని పళనిసామి వర్గం ఆందోళన చెందుతోంది.

అయితే పళనిసామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన వర్గంలోని కొంతమంది ధీమాతో ఉన్నారు.

గవర్నర్ ను కలిసి..తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వనిపక్షంలో...124మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ముందు పరేడ్ చేయాలన్న ఆలోచనలో పళనిసామి టీం ఉన్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.