యాప్నగరం

శశికళ పేరెత్తిన మంత్రి...గందరగోళం

తమిళనాడులో ఎన్నో వివాదాల మధ్య పళని స్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.

TNN 16 Mar 2017, 2:58 pm
తమిళనాడులో ఎన్నో వివాదాల మధ్య పళని స్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం 2017-18 ఏడాదికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. తమిళనాడు ఆర్థిక మంత్రి డి జయకుమార్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ ‘గౌరవనీయులైన చిన్నమ్మ’ అని మొదలుపెట్టారు. దానిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. శశికళ పేరును ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆందోళన చేసింది. ఆమె పేరును రికార్డుల నుంచి తొలగించాలని కోరింది.
Samayam Telugu palaniswami govt presents maiden budget in tamil nadu
శశికళ పేరెత్తిన మంత్రి...గందరగోళం


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైల్లో ఉన్న వ్యక్తి పేరును ఎలా ప్రస్తావిస్తారని డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించారు. అయితే తమ పార్టీ అధినేత్రి పేరును ప్రస్తావించడంలో తప్పు లేదని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చుకున్నారు. డీఎంకే మాత్రం రికార్డుల నుంచి శశికళ పేరును తొలగించాల్సిందేనని పట్టుబట్టింది. అందుకు స్పీకర్ నిరాకరించడంతో... స్పీకర్ ధన్ పాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. గురువారం ఎజెండా ప్రకారం బడ్జెట్ సమర్పణ మాత్రమే జరగాలని స్పీకర్ స్పష్టం చేశారు. మిగతా చర్చలు తరువాత పెట్టుకుందామని తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని చేపట్టారు ఆర్థిక మంత్రి జయకుమార్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.