యాప్నగరం

బ్యానర్లు కట్టి హడలెత్తిస్తున్న గ్రామ పంచాయతీ

మద్యం సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తే వారికి రూ.20,000 వేల జరిమానా, మద్యం కొనేవారికి రూ.5000 జరిమానా వేసి వసూలు చేస్తామని హెచ్చరించింది.

Samayam Telugu 17 Dec 2018, 11:17 pm
మద్యపాన నిషేధంపై పోరాడి విసుగెత్తిపోయిన గ్రామస్తులు చివరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ సరఫరా చేస్తున్నా, లేక ఎవరైనా కొంటున్నట్లు కనిపించినా తక్షణమే ఫొటో తీసి తమకు అందించాలని కోరుతున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మనపురా గ్రామ పంచాయతీ మద్యం నిషేధించింది. అయినా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారి గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకు మద్యం వస్తూనే ఉంది.
Samayam Telugu Liquor


ఇకనుంచీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మద్యం సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తే వారికి రూ.20,000 వేల జరిమానా, మద్యం కొనేవారికి రూ.5000 జరిమానా వేసి వసూలు చేస్తామని హెచ్చరించింది. ఆర్మోరీ, మల్చెరా జిల్లాలు మద్యం విక్రయాలను వ్యతిరేకిస్తుండగా.. గోండియా, భండారా జిల్లాల నుంచి మనపురా చుట్టుపక్కల గ్రామాలకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారు.

ఒకవేళ మద్యం అమ్మాయిని ఉంటే జరిమానా విధించినప్పుడల్లా 20 వేలు కట్టాలని, మందుబాబులు రూ.5 వేలు చెల్లించి మద్యం కొనుగోలు చేయవచ్చునని కండీషన్ పెట్టారు. దీంతోపాటు మద్యం విక్రయించేవారి ఫొటోలు, మద్యం కొనుగోలు చేస్తున్న గ్రామస్తుల ఫొటోలను బ్యానర్లుగా పెట్టారు. దీంతో వీరు మద్యం జోలికి వెళ్లాలంటే వణికిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.