యాప్నగరం

నేను సీఎం కావాలని ఓపీఎస్ ఒత్తిడి తెచ్చారు

‘‘అమ్మ (జయలలిత) మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ఓ పన్నీరు సెల్వం నన్ను కోరారు.

TNN 5 Feb 2017, 4:43 pm
‘‘అమ్మ (జయలలిత) మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ఓ పన్నీరు సెల్వం నన్ను కోరారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక ఆయనే సీఎం కావాలని నాపై ఒత్తిడి తెచ్చారు’’ అని వీకే శశికళ అన్నారు.
Samayam Telugu panneer selvam insisted me to become cm sasikala
నేను సీఎం కావాలని ఓపీఎస్ ఒత్తిడి తెచ్చారు


ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శశికళ శాసనసభాపక్ష నేతగా ఓ పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. తనను శాసనసభా నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం ఆమె ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

అమ్మ (జయలలిత) బాటలో చిన్నమ్మ (శశికళ) నడుస్తారని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామని పార్టీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో చెప్పారు. శాసనసభా నేతగా శశికళ ఎన్నికయ్యాక పార్టీ ఆఫీసు ప్రాంగణంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

కాగా, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా వీకే శశికళ ఈనెల 9న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.