యాప్నగరం

‘అమ్మ’ కోసం పన్నీరు నిరాహార దీక్ష!

జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే రెబల్ లీడర్ ఒ. పన్నీరు సెల్వం బుధవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

TNN 8 Mar 2017, 1:58 pm
జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే రెబల్ లీడర్ ఒ. పన్నీరు సెల్వం బుధవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో కలసి చెన్నైలోని ఎగ్మోర్‌లో ఉన్న రాజరత్నం స్టేడియం బయట ఏర్పాటుచేసిన వేదికపై దీక్షకు కూర్చకున్నారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పన్నీరు వర్గీయులు రెండురోజుల ముందే పోలీసు శాఖను సంప్రదించారు. రాష్ట్ర డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్లను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. దీనికి పోలీసులు అంగీకరించడంతో బుధవారం దీక్ష ప్రారంభించారు.
Samayam Telugu panneerselvam begins day long fast demanding inquiry into jayalalithaas death
‘అమ్మ’ కోసం పన్నీరు నిరాహార దీక్ష!


కాగా, పన్నీరు సెల్వంకు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే ఎంపీలు ఈనెల 1న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు వి. మైత్రేయన్‌.. జయలలిత మృతిపై ప్రజలకి, అన్నాడీఎంకే నాయకులకు సందేహాలు ఉన్నాయని తెలిపారు. మరి అమ్మకు ఎంతో నమ్మకస్తుడైన పన్నీరు సెల్వం ఒక్క రోజు దీక్షతో తమిళనాడు యంత్రాంగాన్ని కదిలించగలరా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.