యాప్నగరం

పన్నీరు సెల్వం ఓ కుట్రదారుడు, ద్రోహి: శశికళ

అన్నాడీఎంకే శాసన సభా పక్షనేత శశికళ బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

TNN 8 Feb 2017, 1:34 pm
అన్నాడీఎంకే శాసన సభా పక్షనేత శశికళ బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పన్నీరు సెల్వం తిరుగుబాటు అనంతరం ఆమె మొదటిసారి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు కొన్ని గంటల పాటూ తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలతో సమావేశమై పలు విషయాలు మాట్లాడారు. అనంతరం ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని చీల్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారని, అవేవీ సఫలమవ్వవని అన్నారు. పార్టీని రెండుగా చీల్చడం ఎవ్వరితరం కాదన్నారు. రెండు రోజుల వరకు మౌనంగా ఉన్న పన్నీరు సెల్వం ఇప్పుడు తిరుగుబాటు చేయడంపై అందరూ ఆలోచించాలన్నారు. ఆయన వెనుక ఎవరున్నారో గుర్తించాలని అన్నారు. మోసగాళ్లెవరో గుర్తించాలని కోరారు. పన్నీరు సెల్వం ద్రోహి, ఓ మోసగాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఉన్నప్పుడు కూడా చాలా కుట్రలు జరిగాయని, ఆమె అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టారని తెలిపారు.
Samayam Telugu panneerselvam is a traitor says sasikala
పన్నీరు సెల్వం ఓ కుట్రదారుడు, ద్రోహి: శశికళ


అందరం అమ్మ బాటలోనే నడుద్దామని తెలిపారు. తనకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. రాష్ట్రపతి వెంటనే తమిళనాట రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. అన్నా డీఎంకే పార్టీ పునాదులను ఎవరూ కూల్చలేరని చెప్పారు. పార్టీ అంతా కలిసే ఉందని, దానిని ఎవరూ చీల్చలేరని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.