యాప్నగరం

బలనిరూపణకు అవకాశం ఇవ్వండి: పన్నీర్ సెల్వం

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

TNN 9 Feb 2017, 5:42 pm
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. గవర్నర్‌తో 15 నిమిషాల పాటు సమావేశమైన పన్నీర్ సెల్వం అసెంబ్లీలో బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పన్నీర్.. తనతో సీఎం పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శశికళకు లేదని వెల్లడించారు.
Samayam Telugu panneerselvam meets governor vidyasagar rao
బలనిరూపణకు అవకాశం ఇవ్వండి: పన్నీర్ సెల్వం


కాగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఈరోజు రాత్రి 7.30 గంటలకి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉన్నట్లు చెపుతున్న శశికళ... తనతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని గవర్నర్‌ను కోరనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న లేఖను గవర్నర్‌కు అందించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.