యాప్నగరం

అసెంబ్లీలో మంత్రిపై కాగితాలు విసిరేసిన సందర్శకుడు

ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా

Samayam Telugu 28 Jun 2017, 4:32 pm
ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి సత్యేంద్ర జైన్ పై సందర్శకుల గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి కాగితాలు బంతిలా తయారు చేసి విసరడం కలకలం సృష్టించించింది. దీంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు.
Samayam Telugu paper missile hurled at minister inside delhi assembly aap mlas beat up two youths
అసెంబ్లీలో మంత్రిపై కాగితాలు విసిరేసిన సందర్శకుడు


అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సందర్శకుల గ్యాలరీలోకి వచ్చి.. మంత్రిపై కాగితాలు విసిరేసిన యువకుడితో పాటు మరో యువకుడిని చితకబాదారు.


మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న సత్యేంద్ర జైన్ ను తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని సదరు యువకులు నినాదాలు చేసినట్లు సమాచారం. అయితే వీరు కూడా ఆప్ కార్యకర్తలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన కపిల్ మిశ్రా అనుచరులుగా వీరిని అనుమానిస్తున్నారు. మిశ్రా సత్యేంద్రపై పలు అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.