యాప్నగరం

ధనుష్.. మీ వాదన ఏప్రిల్ 11న వింటాం: హైకోర్టు

తమిళ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఎవరి కొడుకనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

TNN 27 Mar 2017, 8:08 pm
తమిళ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఎవరి కొడుకనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ధనుష్ తమ కొడుకేనని మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథిరేసన్(60), కె. మీనాక్షి(55) దంపతులు కోర్టుకెక్కారు. ప్రస్తుతం మేలూరు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయితే మేలూరు కోర్టులో జరుగుతున్న విచారణను రద్దు చేయాలని కోరుతూ ధనుష్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ మేరకు మధురై బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణను మధురై బెంచ్ ఏప్రిల్ 11కి వాయిదా వేసింది.
Samayam Telugu parentage claim madras hc adjourns dhanushs case to april 11
ధనుష్.. మీ వాదన ఏప్రిల్ 11న వింటాం: హైకోర్టు


కాగా, కథిరేషన్, మీనాక్షి తన తల్లిదండ్రులు కారని, తన వద్ద నుంచి డబ్బు గుంజేందుకే ఎవరో వెనకుండి వారిని నడిపిస్తున్నారని ధనుష్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ధనుష్ తమ కొడుకేనంటూ ఆ వృద్ధ దంపతులు వాదిస్తున్నారు. ధనుష్‌కు మెడపై వెనుక భాగంలో, ముంజేతిపై మచ్చలు ఉంటాయని చెపుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ధనుష్ నుంచి నెలకు రూ. 65వేల భరణం ఇప్పించాలని కోరుతున్నారు. అయితే ధనుష్ తన ఒంటిపై పుట్టుమచ్చలను లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా చెరిపేసుకున్నట్లు మేలూరు కోర్టుకు డాక్టర్లు నివేధించిన సంగతి తెలిసిందే. దీంతో ధనుష్ చిక్కుల్లో పడినట్లు అయింది. మరి ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.