యాప్నగరం

పక్కింటి మహిళతో పరారైన కొడుకు.. తల్లిదండ్రులు ఆత్మహత్య

పక్కింట్లోని వివాహితతో శారీరక సంబంధం పెట్టుకున్న కుమారుడు అమెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Samayam Telugu 14 Dec 2018, 1:10 pm
పక్కింట్లో ఉండే మహిళతో తమ కొడుకు వివాహేతర సంబంధం పెట్టుకుని, అమెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషాదకరమైన ఈ ఘటన కర్ణాటకలోని కనకపుర తాలూకా కల్లిగౌడనదొడ్డిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యభర్తలైన సిద్ధరాజు (52), సాకమ్మ (42)లకు కుమారుడు మను (25) ఉన్నాడు. వ్యవసాయ కుటుంబం కావడంతో మను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వారి పక్కింట్లోని మహిళతో మను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా సంబంధం కొనసాగుతోంది. ఇద్దరివీ వేర్వేరు కులాలు అందులోనూ ఆమెకు వివాహమై ఓ రెండేళ్ల పాప ఉండటంతో మహిళ భర్త, బంధువులు వీరిని హెచ్చరించారు. అయినా సరే వారు తమ శారీరక సంబంధాన్ని కొనసాగించారు.
Samayam Telugu kanakapuraparents001


సదరు మహిళ బంధువులు మరింత బెదిరించడంతో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఇద్దరూ పరారయ్యారు. దీంతో, మను తల్లిదండ్రులు సిద్ధరాజు, సాకమ్మలను గ్రామస్థులు నిందించడం, మహిళ కుటుంబసభ్యులు వారి ఇంటి ముందు గొడవకు దిగారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు బుధవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు వల్ల తమ పరువు పోయిందని భావించిన తల్లిదండ్రులు ఇంట్లో పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించామని వెల్లడించారు. కొడిహళ్లి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పరారైన జంట కోసం గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.