యాప్నగరం

ప్రతిపక్షాల తీరుకు 'మోదీ' సంచలన నిర్ణయం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టాలని ఆయన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.

TNN 6 Apr 2018, 6:26 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రతిపక్షాల తీరుకు నిరసనగా బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. శుక్రవారం (ఏప్రిల్ 6) పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడిన అనంతరం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu Modi


ఈ మేరకు ఏప్రిల్ 12న దీక్షకు దిగాలని మోదీ సూచించారని... కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మోసపూరిత విధానాలను అవలంభిస్తుందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ ఇలా చేయడం తగదన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.