యాప్నగరం

ప్రతిపక్షాలే రాష్ట్రపతిని ఆవేదనకు గురిచేశాయి

ప్రతిపక్షాల తీరువల్లే చీటికీమాటికీ వాయిదా పడుతున్న పార్లమెంటు సమావేశాల తీరును చూసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలత

Samayam Telugu 10 Dec 2016, 2:36 pm
ప్రతిపక్షాల తీరువల్లే చీటికీమాటికీ వాయిదా పడుతున్న పార్లమెంటు సమావేశాల తీరును చూసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలత చెందారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం గుజరాత్ లోని దీసలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. రూ.350 కోట్ల విలువైన పాల పంపిణీ కేంద్రాన్ని ఆవిష్కరించారు.
Samayam Telugu parliament logjam anguished president modi
ప్రతిపక్షాలే రాష్ట్రపతిని ఆవేదనకు గురిచేశాయి


నోట్లరద్దు అంశంపై తరచూ వాయిదాపడుతున్న పార్లమెంటు సమావేశాల తీరుపై ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంపీలు ఎన్నుకున్నది సభల్లో ధర్నాలు చేయడానికి కాదని, ప్రజల తరపున మాట్లాడాలని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రపతి వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. ప్రతిపక్షాల తీరు వల్లే రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవమున్న రాష్ట్రపతి కూడా ఆవేదన చెందారని అన్నారు. నోట్లరద్దుపై తాను సభలో మాట్లాడతానన్నా ప్రతిపక్షాలు వినిపించుకోవడం లేదని మోదీ ఆరోపించారు. తనను లోక్ సభలో మాట్లాడనివ్వనందుకే ‘జనసభ’ (ప్రజల్లో) లో మాట్లాడుతున్నానని అన్నారు.

నోట్లరద్దు వల్ల తీవ్రవాదం, నక్సలిజం, నకిలీనోట్ రాకెట్ల మూలాలు పెలికించుకుపోయి..పేదల జీవితాలు ఉజ్వలంగా బలోపేతం కావడానికి మార్గం సుగమం అయ్యిందని మోదీ అభివర్ణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.