యాప్నగరం

పెద్ద నోట్ల రద్దుపై రచ్చ: ఉభయ సభలు రేపటికి వాయిదా

పెద్ద నోట్ల రద్దు అంశంతో పార్లమెంట్ అట్టుడికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరవ్వాలని, నోట్ల రద్దు అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.

TNN 22 Nov 2016, 3:15 pm
పెద్ద నోట్ల రద్దు అంశంతో పార్లమెంట్ అట్టుడికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరవ్వాలని, నోట్ల రద్దు అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు స్పీకర్ వెల్‌వైపు దూసుకొస్తూ నిరసనలు చేపట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభలు హోరెత్తాయి.
Samayam Telugu parliament winter session lok sabha and rajya sabha adjourned till tomorrow
పెద్ద నోట్ల రద్దుపై రచ్చ: ఉభయ సభలు రేపటికి వాయిదా


ఈ నేపథ్యంలో ఉభయ సభలను పలు మార్లు వాయిదా వేసిన సభాపతులు చివరకు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చను మొదలు పెట్టాలని అధికార బీజేపీ నేతలు లోక్‌సభలో పట్టుబట్టగా.. మోదీ లేకుండా చర్చ జరిగేది లేదని విపక్షాలు భీష్మించి కూర్చుకున్నాయి. దీంతో చేసేదేమీ లేక లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను బుధవారానికి వాయిదా వేసారు.

మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ బయట మాట్లాడుతున్న ప్రధాన మంత్రి మోదీ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలంతా మోదీ సభకు హాజరుకావాలని నిరసన తెలిపారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేసిన చైర్మన్ హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ కురియన్ చివరకు సభను బుధవారానికి వాయిదా వేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.