పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు లోక్సభలో హాజరయ్యారు. సమావేశాలు 11వ రోజైన బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మోదీ తన సీటులో ఆసీనులయ్యారు. అయితే నోట్ల రద్దుపై చర్చ జరపాలని, ప్రధాన మంత్రి వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. అలాగే మంగళవారం జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై కూడా సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
అయితే ఈ రెండు అంశాలపైనా చర్చకు సిద్ధమని బీజేపీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే 10 రోజులు వృథాగా పోయాయని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వం చారిత్రాత్మిక నిర్ణయం తీసుకుంటే దానిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉభయసభలు సజావుగా జరగడానికి సభ్యులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల అభిప్రాయలు తాము తెలుసుకోవాలనుకుంటున్నామని, వారి సలహాలు వినడానికి సిద్ధమని అన్నారు.
అయితే ఈ రెండు అంశాలపైనా చర్చకు సిద్ధమని బీజేపీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే 10 రోజులు వృథాగా పోయాయని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వం చారిత్రాత్మిక నిర్ణయం తీసుకుంటే దానిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉభయసభలు సజావుగా జరగడానికి సభ్యులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల అభిప్రాయలు తాము తెలుసుకోవాలనుకుంటున్నామని, వారి సలహాలు వినడానికి సిద్ధమని అన్నారు.