యాప్నగరం

కేంద్ర కేబినెట్‌లో స్వల్ప మార్పులు

కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నరేంద్ర సింగ్ తోమర్‌కు అప్పగిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 13 Nov 2018, 9:59 pm
కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నాయి. దివంగత మంత్రి అనంతకుమార్‌ నిర్వహించిన రెండు శాఖలను మరో ఇద్దరు మంత్రులకు అదనంగా కేటాయించారు. మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు. మరో మంత్రి సదానంద గౌడకు ఎరువులు, రసాయనాల శాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (నవంబర్ 13) నిర్ణయం తీసుకున్నారు. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న అనంత్ కుమార్ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Samayam Telugu cabinet


అనంత కుమార్ అంత్యక్రియలు బెంగళూరులో అధికారిక లాంఛనాల మధ్య మంగళవారం పూర్తయ్యాయి. కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, పియూష్‌ గోయల్‌, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాణీ, కర్ణాటకకు చెందిన రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై అనంత్ కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు. అనంత కుమార్‌ మృతిపట్ల కేంద్ర మంత్రి వర్గం సంతాపం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.