కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మోడీకి పంపించినట్లు ఆయన ఈ రోజు ఉదయం తెలిపారు. పారికర్.. గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగారు. గోవా ముఖ్యమంత్రిగా పారికర్ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పది మంది మంత్రులతో ఆయన ప్రమాణం చేయనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాకు పారికర్ ఆదివారం (మార్చి 12) విజ్ఞప్తి చేశారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు ఎంజీపీ, ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పారికర్.. గవర్నర్కు జాబితా ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన గవర్నర్.. ఆయణ్ని ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రమాణస్వీకారం చేశాక 15 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆయనకు సూచించారు.
తాజా ఎన్నికల్లో 17 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాకు పారికర్ ఆదివారం (మార్చి 12) విజ్ఞప్తి చేశారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు ఎంజీపీ, ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పారికర్.. గవర్నర్కు జాబితా ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన గవర్నర్.. ఆయణ్ని ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రమాణస్వీకారం చేశాక 15 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆయనకు సూచించారు.
తాజా ఎన్నికల్లో 17 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే.