యాప్నగరం

పైలట్ తప్పిదం.. వినికిడి కోల్పోయిన ప్రయాణికుడు

విమాన ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ.. పైలట్లు చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆ ప్రయాణికుడు ఎదుర్కొంటున్న సమస్యే ఇందుకు నిదర్శనం.

Samayam Telugu 22 Nov 2018, 7:46 pm
పైలట్ చేసిన చిన్న తప్పిదం ఓ ప్రయాణికుడిని పూర్తిగా చెవిటివాడిగా మార్చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సెప్టెంబరు 20న చోటుచేసుకుంది. ముంబయి - జైపూర్ జెట్ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన పొరపాటు వల్ల ఆ ప్రయాణికుడి చెవి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఆ తర్వాత క్రమేనా అతడు వినికిడి కోల్పోయాడు.
Samayam Telugu 388233


అసలేం జరిగిందంటే..: సెప్టెంబరు 20న ముంబయి నుంచి 166 మంది ప్రయాణికులతో జైపూర్ బయల్దేరిన విమానంలో పైలట్లు ప్రధాన క్యాబిన్‌లోని ప్రెషర్ స్విచ్‌ను ఆన్ చేయడం మరిచిపోయారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. సుమారు 30 మంది ప్రయాణికులు చెవి, ముక్కు సమస్యలతో బాధపడ్డారు. తప్పిదాన్ని గుర్తించిన పైలట్లు ఆక్సిజన్ మాస్క్‌లు వదిలి.. విమానాన్ని తిరిగి ముంబయికి మళ్లించారు. ప్రయాణికుల్లో ఒకరైన ముఖేష్ శర్మకు చెవి నుంచి రక్తం కారింది. ఇప్పుడు ఆయన పూర్తిగా వినికిడి సమస్యతో బాధపడుతున్నారు.

శర్మ పోర్చుగల్‌లోని అవిరో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసి పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. అయితే, వినికిడి సమస్య వల్ల ఉద్యోగాన్ని సైతం వదిలేసే పరిస్థితి ఏర్పడిందని శర్మ వాపోయారు. శర్మతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. అయితే, విమానయాన సంస్థ ఇప్పటివరకు తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని ప్రయాణికులు తెలుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.