యాప్నగరం

పఠాన్‌కోట్ చార్జిషీట్‌లో జైషే మహమ్మద్ అరాచకాలు

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దురాగతాలని పఠాన్‌కోట్...

TNN 21 Dec 2016, 5:33 am
పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దురాగతాలని పఠాన్‌కోట్ ఘటనలో ఛార్జ్ షీట్ బట్టబయలు చేసింది. పఠాన్‌కోట్ కన్నా ముందే జమ్మూకాశ్మీర్‌లోని తంగధర్, కత్వా, సాంబ, రాజ్ బాఘ్ వంటి ప్రాంతాల్లో గతేడాది పేలుళ్లకు పాల్పడింది జైషేమహమ్మద్ సంస్థే అని కేంద్రం ప్రకటించింది. తమ వాదన నిజం అని చెప్పడానికి అవసరమైన అన్ని ఆధారాలు తమ వద్ద వున్నాయని ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి తెలిపారు.
Samayam Telugu pathankot attacks charge sheet reveals jem role in jk blasts
పఠాన్‌కోట్ చార్జిషీట్‌లో జైషే మహమ్మద్ అరాచకాలు


పఠాన్‌కోట్ దాడుల్లో ప్రధానమైన ఉద్రవాది అయిన కాశీఫ్ జన్ ఫేస్‌బుక్ పేజీని పరిశీలించగా... అందులో తాను గతేడాది మార్చి 20-21న జరగనున్న కత్వా, సాంబ దాడులకి వ్యూహరచన చేసుకున్న విషయాన్ని ప్రస్తావించినట్టుగా భారత భద్రతావర్గాలు గుర్తించాయి. అంతేకాకుండా పఠాన్‌కోట్ దాడులు జరిగినంతసేపు అక్కడ దాడులకి పాల్పడినవారితో అతడు నిరంతరం ఫోన్ లో సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలున్నాయని తేలింది.

ఇవన్నీ కాకుండా పఠాన్‌కోట్ దాడులపై దర్యాప్తు జరిపి నమోదు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం... పఠాన్‌కోట్‌లో వదిలివెళ్లిన 2 పేపర్ చీటీల్లో సైతం ఉగ్రవాదులు ఇదే విషయాన్ని పేర్కొన్నారు. " జైషే మహమ్మద్ జిందాబాద్... తంగధర్ నుంచి తీసుకుని సాంబ, కత్వా, రాజ్‌బాగ్, ఢిల్లీ వరకు తమ గుర్తులు మీకు కనిపిస్తూనే వుంటాయి" అని హిందీ, ఉర్దూ భాషల్లో అందులో పేర్కొన్నారు. ఈ సాక్షాధారాలన్నీ లభించిన నేపథ్యంలోనే జైషే మహమ్మద్ అధినేత అయిన మౌలానా మసూద్ అజహార్, అతడి సోదరుడు అబ్ధుల్ రవూఫ్, షాహీద్ లతీఫ్, కాశీఫ్ సహా ఇతర జైషే మహమ్మద్ నేతలపై చార్జ్ షీట్ నమోదు చేసిన విషయాన్ని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కి కూడా తెలియచేయదల్చుకున్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.