యాప్నగరం

గంగానదిలో బోటు మునక.. ఐదుగురు దుర్మరణం

గంగానదిలో బోటు మునిగి అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో అయిదుగురు గల్లంతయ్యారు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోని ఫతువా వద్ద ఈ ప్రమాదం జరిగింది.

TNN 31 Jan 2018, 4:00 pm
గంగానదిలో బోటు మునిగిన ఘటనలో అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో అయిదుగురు గల్లంతయ్యారు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోని ఫతువా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బోటులో 15 మంది ఉన్నట్లు సమాచారం. మరణించినవారంతా మహిళలే. అయిదుగురు వ్యక్తులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం రెస్య్కూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
Samayam Telugu patna boat capsizes in river ganga 5 people dead
గంగానదిలో బోటు మునక.. ఐదుగురు దుర్మరణం


మాఘ పూర్ణిమ సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి బుధవారం (జనవరి 31) భక్తులు పెద్ద సంఖ్యలో ఫతువాలోని మస్తానా ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం బోటింగ్ కోసం అనేక మంది పర్యాటకులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా విషాదం చోటు చేసుకోవడంతో భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని, గయా జిల్లా నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గతేడాది నవంబర్‌లో బీహార్‌లోని భాగమతి నదిలోనూ బోటు గల్లంతై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.