క్యాన్సర్తో బాధపడుతున్న ఓ పేషంట్ చివరి కోరిక తీర్చేందుకు పట్నాలోని ఎయిమ్స్ వైద్యులు చొరవ చూపారు. ఐసీయూలో పరిసరాల్లో వివాహ వేదికని ఏర్పాటు చేసి పేషంట్ కళ్లముందే కూతురి వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే.. బిహార్లోని ఓ మారుమూల ప్రాంతానికి మహిళ (50) ఇటీవల గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ ఎయిమ్స్లో చేరింది. ఆమెని పరీక్షించిన వైద్యులు.. బ్రతికేది కొద్దిరోజులేనని తేల్చేశారు. అయితే.. అప్పటికే ఆమె కూతురి వివాహం ఈ నెల 18న జరపాలని నిశ్చయించి ఉండటంతో.. తాను ఆ వివాహం చూడలేనేమోనని పేషంట్ దిగులు పెట్టుకుని.. తన చివరి కోరిక తీర్చాలంటూ వైద్యుల్ని అభ్యర్థించింది.
పేషంట్ చివరి కోరిక తీర్చేందుకు ఆసుపత్రి సిబ్బంది చొరవ చూపారు. ఆసుపత్రిలోని వైద్యులంతా కలిసి ఐసీయూకి వెలుపల వివాహ వేదికని ఏర్పాటు చేశారు. బెడ్పై పడుకుని ఉన్న పేషంట్ కళ్ల ముందే ఆమె కూతురు వేద మంత్రాలు సాక్షిగా వరుడితో తాళి కట్టించుకుంది. దిగులు పెరగడంతో.. ఆమె రెండు రోజుల కంటే ఎక్కువ జీవించదని తొలుత తాము భావించామని.. కానీ.. కూతురు పెళ్లి తర్వాత వైద్యానికి ఆమె శరీరం చురుగ్గా స్పందించినట్లు వైద్యులు తెలిపారు.
పేషంట్ చివరి కోరిక తీర్చేందుకు ఆసుపత్రి సిబ్బంది చొరవ చూపారు. ఆసుపత్రిలోని వైద్యులంతా కలిసి ఐసీయూకి వెలుపల వివాహ వేదికని ఏర్పాటు చేశారు. బెడ్పై పడుకుని ఉన్న పేషంట్ కళ్ల ముందే ఆమె కూతురు వేద మంత్రాలు సాక్షిగా వరుడితో తాళి కట్టించుకుంది. దిగులు పెరగడంతో.. ఆమె రెండు రోజుల కంటే ఎక్కువ జీవించదని తొలుత తాము భావించామని.. కానీ.. కూతురు పెళ్లి తర్వాత వైద్యానికి ఆమె శరీరం చురుగ్గా స్పందించినట్లు వైద్యులు తెలిపారు.