యాప్నగరం

రామమందిరానికి విరాళాల వెల్లువ.. పాట్నా మహావీర్ ఆలయం రూ.10 కోట్ల విరాళం

దాదాపు ఒకటిన్నర శతాబ్దంపాటు దేశ రాజకీయ, మతపరమైన అంశాలను ప్రభావితం చేసిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కివచ్చింది.

Samayam Telugu 9 Feb 2020, 3:05 pm
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతవారం లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర’ పేరుతో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉండగా, మాజీ అటార్నీ జనరల్, అయోధ్య కేసులో హిందువుల పక్షాన వాదనలు వినిపించిన కే పరాశరన్ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల్లోగా ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటుచేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu kishorekunal-1581216656


కాగా, ఈ ట్రస్ట్‌కు విరాళాలు నగదు, ఆస్తుల రూపంలోనూ ఇచ్చినా బేషరతుగా స్వీకరిస్తామని ప్రకటించింది. దీంతో ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా, పాట్నాలోని మహవీర్‌ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. తొలుత రూ.2 కోట్లను చెక్కు రూపంలో అందజేయనున్నట్లు తెలిపింది. మిగతా సొమ్మును నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత దశలవారీగా అంజేస్తామని మహావీర్ మందిర్ న్యాస్ కార్యదర్శి ఆచార్య కిశోర్ కునాల్ తెలియజేశారు. మొదటి విడతలో రూ.2 కోట్ల చెక్కును తీసుకుని తాను అయోధ్య వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోకరమని అన్నారు. అంతేకాదు, వివాదాస్ప 67.07 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు కేటాయిస్తూ మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారని ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ట్రస్ట్‌కు తొలి విరాళంగా కేంద్రం ఒక్క రూపాయిని అందజేసింది. ప్రస్తుతం ఛైర్మన్ పరాశరన్ ఇంటి నుంచే ట్రస్ట్ కార్యకలాపాలు సాగుతుండగా, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు.

అయితే, మందిర నిర్మాణానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన హుండీలో అణాపైస విలువ చేసే ముప్ఫై నాణేలను భక్తులు వేశారని కునాల్ వెల్లడించారు. వీటిపై సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ పురాతన నాణేలను ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1818లో ముద్రించినట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.