కావేరీ జలాల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు- కర్నాటక రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. తమిళనాడులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారాలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పు పట్ల తమిళనాడు వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమౌతున్నది. తమిళనాడుకు 2007లో 192 టీఎంసీఅల నీటిని విడుదల చేయాలని ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు వేర్వేరుగా సుప్రీం ను ఆదేశించాయి. కాగా సుప్రీం నేడు తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో తమిళనాడుకు 177 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్నాటకను ఆదేశించింది. ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నప్పటికీ ప్రయివేటు ఆస్తులకు ఎటువంటి హాని కలగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.
తీర్పు వచ్చిన తర్వాత ఒక వైపు కర్ణాటకలో సంబరాలు మొదలవగా మరో వైపు తమిళనాడులో నిరససనలు మొదలయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి పళని సామి సమీక్ష నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్నడ హోటళ్లు, బ్యాంకులు, పాఠశాలలు, దుకాణాలకు రక్షణ కల్పించారు. కావేరీ జలాల పంపకంపై సుప్రీంకోర్టు తీర్పు
తీర్పు వచ్చిన తర్వాత ఒక వైపు కర్ణాటకలో సంబరాలు మొదలవగా మరో వైపు తమిళనాడులో నిరససనలు మొదలయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి పళని సామి సమీక్ష నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్నడ హోటళ్లు, బ్యాంకులు, పాఠశాలలు, దుకాణాలకు రక్షణ కల్పించారు. కావేరీ జలాల పంపకంపై సుప్రీంకోర్టు తీర్పు