యాప్నగరం

త్వరలో ‘పెప్సీ జన్మభూమి’, ‘కోక్ గోదావరి’

త్వరలో మనం బ్రాండెడ్ రైళ్లు, రైల్వే స్టేషన్లను చూడబోతున్నాం.

TNN 9 Jan 2017, 1:14 pm
త్వరలో మనం బ్రాండెడ్ రైళ్లు, రైల్వే స్టేషన్లను చూడబోతున్నాం. అవును మరికొద్ది రోజుల్లో ‘పెప్సీ జన్మభూమి’, ‘కోక్ గోదావరి’, ‘స్ప్రయిట్ ప్రశాంతి’ వంటి బ్రాండెడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. ప్రయాణికులపై భారం వేయకుండా రైల్వే ఆదాయాన్ని పెంచడానికి బ్రాండెడ్ మార్గాన్ని ఎంచుకుంటోంది రైల్వే శాఖ. ఈ మేరకు బ్రాండ్ పేర్లతో రైళ్లను నడపి, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తోంది.
Samayam Telugu pepsi janmabhoomi coke godavari on track railways readies plans to brand trains stations
త్వరలో ‘పెప్సీ జన్మభూమి’, ‘కోక్ గోదావరి’


రైల్వే బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రతిపాదన మరో వారం రోజుల్లో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఒక కంపెనీ మీడియా రైట్స్ సొంతం చేసుకుంటే రైలు మొత్తాన్ని తమ బ్రాండ్‌తో నింపేయొచ్చు. అంటే మరే బ్రాండ్ ప్రకటన ఈ రైలుపై కనిపించదు. రైలు బోగీ బయట, లోపల కూడా ప్రకటనలను అతికించుకోవచ్చు.

ఆదాయాన్ని పెంచుకోవడానికి రైల్వే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రయాణికుల చార్జీల పెంపు భారాన్ని వేయకుండా ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచనలే చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా అమలుచేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. చార్జీల రహిత ఆదాయాన్ని రూ. 2000 కోట్లకు పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.