యాప్నగరం

యూపీలో కొనసాగుతున్న ఐదోవిడత పోలింగ్

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

TNN 27 Feb 2017, 12:24 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 జిల్లాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ పోలింగ్ జరుగుతోంది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ బూతుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu phase 5 polling of assembly in uttar pradesh today
యూపీలో కొనసాగుతున్న ఐదోవిడత పోలింగ్


అంబేద్కర్ నగర్ లోని అలపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ అభ్యర్థి ఆకస్మిక మరణంతో ఆ స్థానికి మార్చి 8న పోలింగ్ నిర్వహించనున్నారు.

11గంటల కల్లా 27శాతం పోలింగ్ నమోదైంది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి కాగా సోమవారం ఐదో విడత ముగియనుంది.

మార్చి11న ఫలితాలు వెలువడనున్నాయి.

అధికార ఎస్పీ- కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోగా..బీజేపీ, బీఎస్పీలు ఒంటరిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.