యాప్నగరం

పార్లమెంట్‌లో చిన్నారిని ఆడించిన ప్రధాని మోదీ, నెటిజన్లను ఫిదా చేసిన ఆ పిల్లాడెవరంటే?

Parliament | ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ఓ చిన్నారితో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచగా కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవడం కోసం జనాలు ఆసక్తి చూపారు.

Samayam Telugu 23 Jul 2019, 6:13 pm
మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో మీటింగ్‌లతో నిత్యం బిజీ బిజీగా గడిపే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఓ ప్రత్యేక స్నేహితుడితో సరదాగా గడిపారు. పార్లమెంట్‌లో ఓ చిన్నారితో ఆడుకుంటున్న ఫొటోలను పోస్ట్ చేసిన ప్రధాని.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ చిన్నారిని స్పెషల్ ఫ్రెండ్‌గా ఆయన పేర్కొన్నారు. కాసేపట్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. చిన్నారితో మోదీ సరదాగా గడుపుతున్న ఫొటోలు నెటిజన్ల మదిని దోచాయి. రెండు గంటల్లోనే ఈ పోస్టుకు 14 లక్షల మందికిపైగా లైక్ కొట్టారు.
Samayam Telugu pjimage - 2019-07-23T173505.522


మోదీతో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపారు. ఆ చిన్నారి ఎవరు సార్ అని కామెంట్లు పెట్టారు. క్రికెటర్ రోహిత్ శర్మ కూతురని కొందరు, అమిత్ షా మనవరాలని మరికొందరు కామెంట్లు పెట్టారు. కానీ ఆ చిన్నారి ఉజ్జయినీ ఎంపీ సత్యనారాయణ జఠియా మనవడని తెలిసింది.
View this post on Instagram A very special friend came to meet me in Parliament today. A post shared by Narendra Modi (@narendramodi) on Jul 23, 2019 at 2:12am PDT
చిన్నారితో మోదీ ఆడుకుంటున్న ఫొటోలను చూసి దేశం మొత్తం ఫిదా అవుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోదీ సైతం నన్ను కోరారని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘‘క్యూట్ పిక్స్, కానీ ప్రతిపక్షాలు మొత్తం ట్రంప్ మాటల పట్ల మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ చిన్నారితో ఆడుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచడం ద్వారా తనేం ఆలోచిస్తున్నారో మోదీ చెప్పకనే చెప్పార’’ని ఈ కశ్మీర్ నేత సెటైర్లు వేశారు.
మూడు రోజుల పర్యటన కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే కశ్మీర్ సమస్య పరిష్కారానికి ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని ఇమ్రాన్ కోరగా.. రెండు వారాల క్రితం మోదీ కూడా నన్ను మధ్యవర్తిత్వం వహించాలని కోరారంటూ ట్రంప్ బాంబు పేల్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.