పుట్టిన రోజు నుంచి చావుల దాకా, గల్లీ మీటింగుల నుంచి ఢిల్లీ వరకు ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, సైన్బోర్డులు పెట్టడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు గురించి చెప్పాల్సిన పనిలేదు. తమ నేతల దృష్టిని ఆకర్షించడానికి ఫోటోలు, పేర్లతో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టేసి తమ విధేయతను చాటుకుంటారు. ఇలాంటి వాటిపై మద్రాసు హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ఫ్లెక్సీలు, హోర్డింగులు, సైన్ బోర్డుల్లో బతికున్నవారి ఫోటోలను వాడరాదని ఆదేశించింది. కేవలం కీర్తిశేషులైన వారి ఫోటోలు, పేర్లును మాత్రమే ప్రదర్శించాలి తప్ప ఫ్లెక్సీలను ఏర్పాటుచేవారి చిత్రాలను కూడా అందులో ఉంచరాదని ఆదేశాలు జారీచేసింది.
జెండాలు, ఫ్లెక్సీల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెన్నైలోని అన్నానగర్కు చెందిన తిరులోచనకుమారి అనే మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటివల్ల తమ ప్రాంతంలోకి వెళ్లే గేటు కూడా కనిపించకుండా పోయిందని ఆమె ఆరోపించారు. మత్తి అనే రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త పిటిషన్ వేసిన మహిళ ఆస్తిలోకి వెళ్లే గేటుకు అడ్డంగా బ్యానర్ ఏర్పాటుచేయడంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని తొలగించినా, మరో రెండు రోజుల తర్వాత రెండు జెండాలు, సైన్ బోర్డు పెట్టాడు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదుచేస్తే వెళ్తే మర్యాద దక్కదని బెదిరించాడు.
దీనిపై తిరులోచనకుమారి కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విద్యానాథన్ పబ్లిక్ ప్రదేశాల్లో వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శని ఆదేశించారు. అక్కడక్కడ కొన్ని బ్యానర్లు, ఫ్లెక్సీలకు అనుమతిచ్చినా సరే, వాటిపై సజీవంగా ఉన్నవారి ఫోటోలను పెట్టరాదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కేసులు పెట్టి, జైల్లో వేస్తామని పోలీసులు కూడా ప్రకటించారు.
జెండాలు, ఫ్లెక్సీల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెన్నైలోని అన్నానగర్కు చెందిన తిరులోచనకుమారి అనే మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటివల్ల తమ ప్రాంతంలోకి వెళ్లే గేటు కూడా కనిపించకుండా పోయిందని ఆమె ఆరోపించారు. మత్తి అనే రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త పిటిషన్ వేసిన మహిళ ఆస్తిలోకి వెళ్లే గేటుకు అడ్డంగా బ్యానర్ ఏర్పాటుచేయడంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని తొలగించినా, మరో రెండు రోజుల తర్వాత రెండు జెండాలు, సైన్ బోర్డు పెట్టాడు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదుచేస్తే వెళ్తే మర్యాద దక్కదని బెదిరించాడు.
దీనిపై తిరులోచనకుమారి కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విద్యానాథన్ పబ్లిక్ ప్రదేశాల్లో వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శని ఆదేశించారు. అక్కడక్కడ కొన్ని బ్యానర్లు, ఫ్లెక్సీలకు అనుమతిచ్చినా సరే, వాటిపై సజీవంగా ఉన్నవారి ఫోటోలను పెట్టరాదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కేసులు పెట్టి, జైల్లో వేస్తామని పోలీసులు కూడా ప్రకటించారు.