యాప్నగరం

అనారోగ్యం..చెన్నై అపోలో లో చేరిన సీఎం

అపోలో ఆసుపత్రి వర్గాలు శనివారం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇచ్చాయి

TNN 3 Mar 2018, 2:16 pm
కేరళ సీఎం పినరాయి విజయన్ చెన్నై అపోలో లో అడ్మిట్ అయ్యారు. అనారోగ్య సమస్యతో ఆయన శుక్రవారం ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజయన్ వయసు 73 సంత్సరాలు. ఈయన తమిళనాడు వెళ్లి ఆసుపత్రిలో చేరడం పై కేరళ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Samayam Telugu pinarayi vijayan hospitalised in chennai
అనారోగ్యం..చెన్నై అపోలో లో చేరిన సీఎం


అయితే అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం శనివారం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇచ్చాయి. విజయన్ కు ప్రత్యేకమైన అనారోగ్య సమస్యలు ఏవీ లేవని, రొటీన్ చెకప్స్ లో భాగంగా మాత్రమే ఆయన ఆసుపత్రిలో చేరారు అని అపోలో వర్గాలు ప్రకటించాయి.

ఆదివారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్థి అయ్యే అవకాశాలున్నట్టుగా కూడా అపోలో తెలిపింది. రక్త కణాల సమస్యతో విజయన్ ఆసుపత్రిలో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రివర్గాలు మాత్రం.. ఏడాది కో మారు చేయించుకునే వైద్య పరీక్షల నిమిత్తమే విజయన్ వచ్చారని అంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.