యాప్నగరం

పీయూష్ గోయల్‌కి రైల్వే బాధ్యతలు

కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొంది ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖను అప్పగించారు.

TNN 3 Sep 2017, 12:48 pm
కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొంది ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖను అప్పగించారు. గతంలో స్వతంత్ర హోదాతో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన పీయూష్.. ఇప్పుడు సురేష్ ప్రభు స్థానాన్ని భర్తీ చేశారు. ఈ మేరకు ఆదివారం రైల్వే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించాలని గత నెలలో సురేష్ ప్రభు ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్ పునర్వవస్థీకరణ వరకు ఆగాల్సిందిగా అప్పట్లో సురేష్‌కు మోదీ సూచించినట్లు వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే సురేష్ ప్రభు రైల్వే మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.
Samayam Telugu piyush goyal is new railways minister replaces suresh prabhu
పీయూష్ గోయల్‌కి రైల్వే బాధ్యతలు


దీంతో విద్యుత్, బొగ్గు సెక్టార్లలో మంచి పనితనం కనబరిచిన పీయూష్ గోయల్‌ను రైల్వే శాఖ మంత్రిగా నియమించాలని బీజేపీ అధిష్టానం భావించిందట. అందుకనే ఆయనకి పదోన్నతి కల్పించి కీలకమైన రైల్వే శాఖను అప్పగించారు. మరోవైపు సురేష్ ప్రభుకు ఏ శాఖను అప్పగిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ రక్షణ శాఖను అప్పగించడానికి సుముఖత చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాకాకుండా రక్షణ శాను అరుణ్ జైట్లీకి అప్పగించి.. గతంలో పీయూష్ చూసుకున్న విద్యుత్ శాఖను సురేష్ ప్రభుకు అప్పగించాలని మోదీ భావిస్తున్నట్లు కొన్ని వర్గాల సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.