యాప్నగరం

ప్యాంగాంగ్ నుంచి వెనక్కి వెళ్తున్నాం.. చైనా కీలక ప్రకటన

Pangong Lake: లడఖ్‌లో నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా ప్రకటించింది. ఇటు భారత్ కూడా మన బలగాలను వెనక్కి రప్పిస్తోంది. ఉద్రిక్తతలకు చరమగీతం పాడే దిశగా ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి..

Samayam Telugu 11 Feb 2021, 9:34 am
డఖ్‌లో సరిహద్దు వెంట కొంత కాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా కీలక ప్రకటన చేసింది. వాస్తవాధీన రేఖకు సమీపంగా మోహరించిన బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 10) ప్రకటించింది. అదనపు బలగాలను ఉపసంహరించుకోవడంతో పాటు యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామగ్రిని వెనక్కి తరలించడం ప్రారంభమైంది. ఇటు భారత్ కూడా మన బలగాలను ఉపసంహరించుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా చర్యలు చేపట్టాయి.
Samayam Telugu ప్యాంగాంగ్ సరస్సు
Pangong Lake


తూర్పు లడఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ నేటి నుంచి ప్రారంభమైందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి యూ కియాన్‌ తెలిపారు. తొమ్మిదో రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఇరు దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై భారత్‌ వైపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతేడాది మే నెల నుంచి లడఖఖ్ సరిహద్దు వెంట భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపున రెట్టింపు నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే.. డ్రాగన్ దీనిపై ఇప్పటివరకు నోరు మెదపలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.