అంతర్జాతీయ సమానత్వదినోత్సవంగా అంబేద్కర్ జయంతి
దీనజన బాంధవుడు అంబేద్కర్ జన్మదినాన్ని యావత్ ప్రపంచం అంతర్జాతీయ సమానత్వ దినోత్సవంగా జరుపుకోవాలనే వినతి ఐక్యరాజ్యమితికి ముందుకు వచ్చింది
TNN 14 Apr 2016, 5:12 pm
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక్క భారతదేశంలో అణగారిన వర్గాల కోసమే పాటుపడలేదని యావత్ ప్రపంచంలో ఆయారూపాల్లో అణచివేతకు గురయిన దీనుల కోసం కూడా కష్టపడ్డారని ఐక్యరాజ్యసమితిలో పలు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ జయంతిని యావత్ జాతి గురువారం నాడు ఘనంగా జరుపుకుంటోంది. ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరై అంబేద్కర్ కు నివాళులర్పించారు.
అంబేద్కర్ కేవలం ఒక్క భారతదేశానికే చెందినవారు కాదని, ఆయన విశ్వపురుషుడని వక్తలు కొనియాడారు. ఆయన జన్మదినాన్ని యావత్ ప్రపంచం అంతర్జాతీయ సమానత్వ దినోత్సవంగా జరుపుకోవాలనే వినతి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందుకు రావడం విశేషం. వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగకుండా పోరాడిన యోధుడు అంబేద్కర్ కు మనం ఈ రకంగా అయినా గుర్తింపునివ్వాలని ఆ వినతిలో పేర్కొన్నారు.
తొలుత ఈ విజ్ఞాపనను పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చరణ్జీత్ సింగ్ అత్వాల్ చేసారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ సమానత్వ దినోత్సవంగా జరపడమే అంబేద్కర్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. న్యూజీలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కీలకోపన్యాసం చేసిన హెలెన్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలం ఇప్పటికీ యావత్ ప్రపంచానికి వర్తిస్తుందన్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే అసమానత్వ పోకడలు ఆయా అణగారిన వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించివేయడమేననే విషయాన్ని అంబేద్కర్ ఏనాడో చెప్పారని, ఆ తత్వాన్నే తదనంతర కాలంలో ఐక్యరాజ్యసమితి దత్తతకు తీసుకుని ప్రపంచంలో అణచివేతకు గురవుతున్నవారి అభివృద్దికి పాటుపడుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలుచేస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గ్రోత్ (ఎస్డీబీ) కార్యక్రమానికి స్ఫూర్తి అంబేద్కర్ ప్రవచిత సిద్దాంతాలేనన్నారు.
ఇదిలా ఉండగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఐరాసలో నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన 550 మంది దౌత్యవేత్తలు, అంతర్జాతీయ అధికారులు, విద్యావేత్తలు, స్వచ్చంద కార్యకర్తలతోపాటు అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంబేద్కర్ కేవలం ఒక్క భారతదేశానికే చెందినవారు కాదని, ఆయన విశ్వపురుషుడని వక్తలు కొనియాడారు. ఆయన జన్మదినాన్ని యావత్ ప్రపంచం అంతర్జాతీయ సమానత్వ దినోత్సవంగా జరుపుకోవాలనే వినతి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందుకు రావడం విశేషం. వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగకుండా పోరాడిన యోధుడు అంబేద్కర్ కు మనం ఈ రకంగా అయినా గుర్తింపునివ్వాలని ఆ వినతిలో పేర్కొన్నారు.
తొలుత ఈ విజ్ఞాపనను పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చరణ్జీత్ సింగ్ అత్వాల్ చేసారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ సమానత్వ దినోత్సవంగా జరపడమే అంబేద్కర్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. న్యూజీలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కీలకోపన్యాసం చేసిన హెలెన్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలం ఇప్పటికీ యావత్ ప్రపంచానికి వర్తిస్తుందన్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే అసమానత్వ పోకడలు ఆయా అణగారిన వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించివేయడమేననే విషయాన్ని అంబేద్కర్ ఏనాడో చెప్పారని, ఆ తత్వాన్నే తదనంతర కాలంలో ఐక్యరాజ్యసమితి దత్తతకు తీసుకుని ప్రపంచంలో అణచివేతకు గురవుతున్నవారి అభివృద్దికి పాటుపడుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలుచేస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గ్రోత్ (ఎస్డీబీ) కార్యక్రమానికి స్ఫూర్తి అంబేద్కర్ ప్రవచిత సిద్దాంతాలేనన్నారు.
ఇదిలా ఉండగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఐరాసలో నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన 550 మంది దౌత్యవేత్తలు, అంతర్జాతీయ అధికారులు, విద్యావేత్తలు, స్వచ్చంద కార్యకర్తలతోపాటు అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.