యాప్నగరం

ప్రధాని ఇజ్రాయిల్‌ పర్యటన వారి కోసమేనట...

గుజరాత్ పర్యటనలో భాగంగా భారతదేశపు వజ్రాల కేంద్రం సూరత్‌లో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రసంగించారు.

TNN 17 Apr 2017, 12:37 pm
గుజరాత్ పర్యటనలో భాగంగా భారతదేశపు వజ్రాల కేంద్రం సూరత్‌లో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రసంగించారు. త్వరలో తాను ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లనున్నట్లు మోడీ వెల్లడించారు. వజ్రాల వ్యాపారానికి సూరత్ అతి పెద్ద కేంద్రం కాగా, ఇజ్రాయిల్ ప్రపంచంలోనే పెద్ద మొత్తంలోనే వజ్రాలను ఉత్తత్తి చేస్తోంది. ఇజ్రాయిల్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆ దేశంతో కుదర్చుకునే వాణిజ్య ఒప్పందాలు మీ కోసమేనని సూరత్ వాసులను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యాలు చేశారు.
Samayam Telugu pm going to israel on july second week
ప్రధాని ఇజ్రాయిల్‌ పర్యటన వారి కోసమేనట...


వచ్చే జులైలో ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జులై రెండో వారంలో హంబర్గ్‌ వేదికగా జరిగే జి-20 సమావేశాల్లో పాల్గొని తిరిగొచ్చిన తర్వాత మోడీ ఇజ్రాయిల్‌లో పర్యటించనున్నారు. భారత్, ఇజ్రాయిల్ మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తికాబోతున్న సందర్భంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పర్యటన వల్ల గతంలో ఉన్న సంబంధాలు మరింత బలపడనున్నాయి. మోడీ కేవలం ఇజ్రాయిల్‌కు మాత్రమే పరిమితం కాకుండా పాలస్తీనాలోనూ పర్యటించనున్నారు. గతంలో చాలా మంది కేంద్ర మంత్రులు ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లారు కానీ పాలస్తీనాను మాత్రం సందర్శిచలేదు. ఇటీవలే ఇజ్రాయిల్‌తో భారత్ 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.