యాప్నగరం

సామాజిక న్యాయమే మన లక్ష్యం: ప్రధాని మోదీ

మనకు మానవ వనరులు ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని సానుకూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయమే మన లక్ష్యం - ప్రధాని

TNN 10 Mar 2018, 12:19 pm
ఢిల్లీ: దేశాభివృద్ధికి పోటీతత్వం, సహకార సమాఖ్య వ్యవస్థలు ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా ప్రారంభమైన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో మోదీ శనివారం ప్రసంగించారు. దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సామజిక న్యాయం సాధ్యం అవుతుందని ప్రధాని తెలిపారు. ‘మనకు మానవ వనరులు ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని సానుకూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయమే మన లక్ష్యమ’ని ప్రధాని తెలిపారు.
Samayam Telugu pm modi addresses national legislators conference
సామాజిక న్యాయమే మన లక్ష్యం: ప్రధాని మోదీ


‘దేశంలో కొన్ని జిల్లాలు అభివృద్ధిలో ముందుంటాయి. మరికొన్ని జిల్లాలు వెనుకంజలో ఉంటాయి. వెనుకబడిన జిల్లాల విషయంలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. పనితీరు ఆధారంగా కలెక్టర్ల బదిలీలు ఉంటాయి. అభివృద్ధి కోసం కలెక్టర్లకు ప్రణాళిక, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం అవసరం. కలెక్టర్ల ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాలతో పోల్చుకోవాలి. జిల్లాల్లోని బాలబాలికలందరికీ విద్య అందితే సామాజిక న్యాయం సాధించినట్లే’నని ప్రధాని తెలిపారు.

జాతీయ ప్రజా ప్రతినిధుల సదస్సును లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శనివారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.