యాప్నగరం

సీఎంలతో మళ్లీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.. ఈసారి రెండు గ్రూపులుగా

Coronavirus India: ఒక్కో గ్రూప్‌తో ఒక్కోరోజు కరోనా కట్టడి చర్చలు జరుపుతారని సమాచారం. 16న నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ ముఖ్యమంత్రి, 17వ తేదీ జరిగే వీసీలో తెలంగాణ సీఎం పాల్గొననున్నారు.

Samayam Telugu 12 Jun 2020, 9:22 pm
ప్రధాని మోదీ మళ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో చేయిదాటి పోతున్న కరోనా కేసులు, వాటి నియంత్రణ, లాక్‌ డౌన్‌ ఎత్తివేత తర్వాత ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలపై మోదీ సీఎంలతో చర్చించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 16, 17 తేదీల్లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సారి దేశంలోని అందరూ ముఖ్యమంత్రులను రెండు టీమ్‌లుగా విభజించి ప్రధాని మోదీ వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఒక్కో గ్రూప్‌తో ఒక్కోరోజు కరోనా కట్టడి చర్చలు జరుపుతారని సమాచారం. 16న నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ ముఖ్యమంత్రి, 17వ తేదీ జరిగే వీసీలో తెలంగాణ సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ (ఫైల్ ఫోటో)
narendra modi interacts with cm


Must Read: హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్! ఎప్పుడంటే.. తలసాని కీలక వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.