యాప్నగరం

మారిషస్ సుప్రీంకోర్టు భవనం ప్రారంభించిన ప్రధాని మోదీ

హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న మారిషస్.. తమకు ఎంతో కీలకమైందని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదేశ సుప్రీంకోర్టు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 30 Jul 2020, 2:49 pm
మారిషస్ ప్రభుత్వం నిర్మించిన సుప్రీంకోర్టు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జుగ్నౌత్‌తో కలిసి మోదీ ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. హిందూ మహాసముద్రంలోని దేశాలతో తమ సహకారం, వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు అందజేస్తామని అన్నారు.
Samayam Telugu ప్రధాని నరేంద్ర మోదీ
mauritius Supreme Court


హిందూ మహాసముద్రంలో మారిషస్ తమకు గుండెకాయ వంటిదని అన్నారు. మారిషస్‌లోనే తాను తొలిసారి భారతదేశ విజన్ ‘సాగర్ - సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ రీజియన్’ గురించి మాట్లాడానని గుర్తుచేశారు. తప్పుడు వ్యూహాలు, లేదా భాగస్వాముల అభివృద్ధి సాధనలో ఆటంకం కలిగిస్తే ‘గ్లోబల్ పవర్ బ్లాక్స్’ సృష్టిస్తాయని పరోక్షంగా మోదీ హెచ్చరించారు.

అభివృద్ధి భాగస్వామ్యాల పేరిట బలవంతంగా దేశాలను నెట్టిన చరిత్ర మనకు నేర్పింది. ఇది వలస, సామ్రాజ్యవాదానికి దారి తీసి, గ్లోబల్ పవర్ బ్లాక్‌లకు నాంది పలికిందని అన్నారు. మారిషస్‌తో పాటు మాల్దీవులు, శ్రీలంకతోనూ సంబంధాలు ఆర్థిక సహకారానికి సరికొత్త ఉత్సాహంతో పునరుద్ధరణకు దారితీశాయని అన్నారు. 800 మిలియన్ డాలర్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హనిమాధూ విమానాశ్రయం విస్తరణ, గుల్హిఫాల్హు పోర్ట్ ప్రాజెక్ట్, క్యాన్సర్ హాస్పిటల్ వంటి అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించామని అన్నారు.

అలాగే మాల్దీవుల రక్షణ రంగం అధునీకరణకు సహకరిస్తామని, ఇనిస్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టడీస్ నిర్మాణానికి సాయపడతామన్నారు. హుకురు మిస్కిగా గుర్తింపు పొందిన మగలోని పురాతన మసీదు పునరుద్ధరణకు తోడ్పాడతమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.