యాప్నగరం

ఢిల్లీ చేరుకున్న ప్రధానమంత్రి మోదీ!

రెండురోజుల నేపాల్ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం (మే 12) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు.

TNN 13 May 2018, 1:23 am
రెండురోజుల నేపాల్ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం (మే 12) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. నేపాల్ ప్రధాని ఓలీతో కలిసి హిందూ ఆలయ నగరాలైన జనక్‌పూర్, అయోధ్య మధ్య 'రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టు'లో భాగంగా.. బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. అదేవిధంగా హిందువుల పవిత్రస్థలం జనక్‌పూర్ అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
Samayam Telugu modi - sushma


భారత్, నేపాల్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించే రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల్లోని 15 ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.