లోక్ సభలో ప్రధాని మోడీ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. లంచ్ వెళ్లున్న సమయంలో ప్రతిపక్ష సభ్యుల వద్ద వెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. తొలుత కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చట్లు చెప్పారు. అనంతరం డీఎంకే ఎంపీ కనిమొళి, నామినేటెడ్ ఎంపీ అను ఆగా తదితరుల దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లారు. ప్రధాని స్థాయిలో ఉండి ఇలా ప్రతిపక్ష సభ్యుల దగ్గరికి స్వయంగా వెళ్లి ఇలా ముచ్చటించడం చూసిన తోటి సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిపక్షలైప్పటికీ సభలో తనకు అందరూ సమానమనే భావన కల్గించేందుకే మోడీ ఇలా వ్యవహరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపక్ష సభ్యులతో మోడీ ముచ్చట్లు..
ఢిల్లీ: లోక్ సభ ఉదయం సెషన్ ముగిసిన తర్వాత వెళ్లున్న సమయంలో ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.
TNN 21 Jul 2016, 9:59 pm