యాప్నగరం

ఇప్పటికే గెలిచాం, ఇప్పుడొచ్చేవి బోనస్ ఓట్లు

ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటి దాకా జరిగిన ఐదు విడతల పోలింగ్ లలో బీజేపీ గెలిచిందని..ఇక మిగిలిన పోలింగ్ లలో వచ్చే ఓట్లన్ని తమకు బోనస్ అని

Samayam Telugu 1 Mar 2017, 2:31 pm
ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటి దాకా జరిగిన ఐదు విడతల పోలింగ్ లలో బీజేపీ గెలిచిందని..ఇక మిగిలిన పోలింగ్ లలో వచ్చే ఓట్లన్ని తమకు బోనస్ అని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు.
Samayam Telugu pm modi claims bjp is winning uttar pradesh
ఇప్పటికే గెలిచాం, ఇప్పుడొచ్చేవి బోనస్ ఓట్లు


‘‘ఐదు విడతల్లో జరిగిన పోలింగ్ లలో ప్రజలు బీజేపీ బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే గెలిచాం. ఆరు, ఏడు విడతల్లో జరిగే పోలింగ్ లలో మీరు బోనస్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది’’ అని మోదీ మహారాజ్ గంజ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో అన్నారు.

రెండు రోజుల క్రితమే ఉత్తర్ ప్రదేశ్ లో సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటు కావచ్చని..తమతో కలిసి వచ్చే చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పిన మోదీ...ఆరో దశ ఎన్నికల ప్రచారంలో...తాము ఇప్పటికే గెలిచేశాం అని పేర్కొనడం గమనార్హం.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తాను స్వచ్ఛ భారత్ అభియాన్ చేపడితే ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు..మురికి రాజకీయాలను కూడా ఏరివేసే కార్యక్రమం చేపట్టారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.