ఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా స్వపక్ష, ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ... నల్లధనం నిర్మూలన, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదామని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో అందరిని కలుపుకొని వెళ్లేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఎవరైనా తనను కలవవచ్చని సూచించారు.
నల్లధనం తో దేశ ఆర్థికాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మోడీ వెల్లడించారు. నల్లధనం నిధులు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం నల్లధనంపై జరుపుతున్న పోరాటానికి అందరూ సహకరించాలని అఖిలపక్ష నేతలకు మోడీ సూచించారు. నోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని ఆయన చెప్పారు. రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు కలిసిరావాలని అన్ని పార్టీలనూ ప్రధాని మోడీ కోరారు.
నల్లధనం తో దేశ ఆర్థికాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మోడీ వెల్లడించారు. నల్లధనం నిధులు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం నల్లధనంపై జరుపుతున్న పోరాటానికి అందరూ సహకరించాలని అఖిలపక్ష నేతలకు మోడీ సూచించారు. నోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని ఆయన చెప్పారు. రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు కలిసిరావాలని అన్ని పార్టీలనూ ప్రధాని మోడీ కోరారు.