యాప్నగరం

National Police Memorial: పోలీస్ మెమోరియల్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నేషనల్ పోలీస్ మెమోరియల్‌ను జాతికి అంకితం చేశారు.

Samayam Telugu 21 Oct 2018, 11:10 am
ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ పోలీస్ మెమోరియల్, మ్యూజియంను జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. దేశ రక్షణ కోసం పోలీసులు, పారామిలటరీ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ నేత అద్వానీ కూడా అమరులకు నివాళులు అర్పించారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైన్యం పోలీసు బలగాలను పొట్టనబెట్టుకుంది. నాటి నుంచి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Samayam Telugu modi npm


పోలీసులు, పారామిలటరీ బలగాలకు దక్కినంత గుర్తింపు విపత్తు సమయాల్లో పనిచేసే వారికి దక్కలేదన్న ప్రధాని.. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని విపత్తు సహాయక బలగాలకు కూడా అంకితం చేశారు. చట్టపరమైన చిక్కుల వల్ల ఇటీవలి కాలంలో స్మారక స్తూపం నిర్మాణం ఆలస్యమైందన్న ప్రధాని.. గత ప్రభుత్వాలు ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.

స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి పోలీసు సిబ్బంది చేసిన అసామాన్య త్యాగాలకు గుర్తుగా ఈ మెమోరియల్‌ను నిర్మించారు. ఢిల్లీలోని చాణక్యపురిలో 6.12 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తు, 238 టన్నుల బరువైన ఏకశిల గ్రానైట్‌తో ఈ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి విధి నిర్వహణలో 34,844 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరి పేర్లను స్మారక స్తూపం గోడపై చెక్కారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.