యాప్నగరం

అత్యంత దు:ఖదాయకం.. విశాఖ ప్రమాదంపై మోదీ స్పందన

Visakhapatnam: అరకు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Samayam Telugu 12 Feb 2021, 11:55 pm
విశాఖపట్నం జిల్లా అరకు లోయలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu అరకు బస్సు ప్రమాదం
Araku Road Accident


‘ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత దుఃఖదాయకం. మరణించిన వారి కుటుంబాలకు నా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు అతి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలుగులోనూ ప్రధానిమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రధాని ట్వీట్‌కు స్పందించిన కొంత మంది నెటిజన్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అటు.. తమిళనాడు ఘటనపైనా మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో 16 మంది మరణించిన అంశంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.

ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా: కిషన్ రెడ్డి
అరకు దుర్ఘటనపై హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అరకు ఘాటు రోడ్డులో ప్రమాదానికి గురైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

విశాఖలో చోటు చేసుకున్న ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.