యాప్నగరం

బీజేపీ కౌరవులు, కాంగ్రెస్ పాండవుల మధ్య కురుక్షేత్రం- రాహుల్

బీజేపీ, ఆరెస్సెస్ కౌరవుల్లా అధికారం కోసం పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాండవుల్లా నిజం కోసం పోరాడుతుంది.

TNN 18 Mar 2018, 5:11 pm
ఢిల్లీలో జరుగుతోన్న ఏఐసీసీ ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించిన ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరును కౌరవులు, పాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధంతో పోల్చారు. బీజేపీ, ఆరెస్సెస్ కౌరవుల్లా అధికారం కోసం పోటీ పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు హత్య కేసులో నిందితుడని రాహుల్ ఎద్దేవా చేశారు.
Samayam Telugu pm modi has betrayed people stays silent on critical issues rahul gandhi at congress plenary session
బీజేపీ కౌరవులు, కాంగ్రెస్ పాండవుల మధ్య కురుక్షేత్రం- రాహుల్


కాంగ్రెస్ దేశానికి గొంతుక కాగా.. బీజేపీది కేవలం ఒక ఆర్గనైజనేషన్ గొంతుక మాత్రమేనన్నారు. దేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో ఆశిస్తోందని రాహుల్ తెలిపారు. కీలక సమస్యల విషయంలో ప్రధాని మౌనం వహించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. అవినీతిని పారదోలతామని, మంచి రోజులు వస్తాయని ప్రధాని మాటిచ్చారు. మోదీ ప్రజల్ని మోసం చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

నీరవ్ మోదీ, లలిత్ మోదీల ప్రస్తావన తీసుకొచ్చిన రాహుల్.. ఆర్థిక మోసాలకు పాల్పడిన వారితో ప్రధాని మోదీని పోల్చారు. గుజరాత్ ఎన్నికల సమయంలో నేను దేవాలయాలను సందర్శించడంపై విమర్శలు చేశారు. నేను గుళ్లకెళ్తాను, మసీదులకెళ్తా, చర్చిలకు కూడా వెళ్తానంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఆరెస్సెస్ దేశంలో హింసను, అస్పృశ్యతను మాత్రమే ప్రోత్సహిస్తోందని రాహుల్ దుయ్యబట్టారు.

గాంధీజీ 15 ఏళ్లు జైలుకెళ్లాడు, దేశం కోసం మరణించాడు. ఆయన కటిక నేల మీద నిద్రించిన విషయాన్ని మర్చిపోవద్దు. కానీ వారి నాయకుడు సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు లేఖ రాశాడని రాహుల్ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.