యాప్నగరం

2030 నాటికి టాప్ 3లో భారత్: ప్రధాని మోదీ

ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ 2030 నాటికి టాప్ 3లో ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేసారు.

TNN 3 Jan 2017, 12:48 pm
ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ 2030 నాటికి టాప్ 3లో ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేసారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మంగళవారం నుంచి జరగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ సదస్సును మోదీ ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి బాలాజీ సన్నిధిలో సైన్స్ కాంగ్రెస్ జరగడం ఆనందకరమని ఆయన అన్నారు. సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు.
Samayam Telugu pm modi inaugurates 104th science congress in tirupati
2030 నాటికి టాప్ 3లో భారత్: ప్రధాని మోదీ


గతేడాది నవంబర్‌లో ఈ దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని ఎన్జీకే మీనన్‌ని గుర్తుచేసుకున్నారు. మీనన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మనకి సమగ్ర సాంకేతిక దృక్పథం అవసరమని, ప్రపంచ స్థాయి టెక్నాలజీని స్థానిక అవసరాలకు తగినట్లుగా మార్చుకోవాలని మోదీ అన్నారు. భారతీయ సైన్స్ ప్రపంచ టెక్నాలజీతో పోటీపడాలని ఆశించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో శాస్త్ర సాంకేతికతే ప్రధానమైందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని స్పష్టం చేసారు.

సవాళ్లను ఎదుర్కొంటున్న ముందుకు సాగుతున్న భారత శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, పరిశోధనలకు ఈ దేశం గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. దేశంలో ప్రతి మూలకు సాంకేతికత వ్యాపించాలని, అప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు. కాగా, సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ 104వ సైన్స్ కాంగ్రెస్ నేటి నుంచి జనవరి 7వ తేదీ వరకు జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.