యాప్నగరం

ఢిల్లీ మెట్రో మాజెంటా లైన్‌ను ప్రారంభించిన మోదీ

ఢిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌లోని మాజెంటా లైన్‌ను ప్రధాని మోదీ డిసెంబర్ 25న జాతికి అంకితం చేశారు. అనంతరం యూపీ సీఎం యోగితో కలిసి రైలులో కొద్ది దూరం ప్రయాణించారు.

TNN 25 Dec 2017, 6:33 pm
దేశ రాజధాని వాసులకు ప్రధాని మోదీ క్రిస్మస్‌ కానుక అందించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌లోని మాజెంటా లైన్‌ను సోమవారం (డిసెంబర్ 25) ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం యూపీ సీఎం యోగితో కలిసి రైలులో కొద్ది దూరం ప్రయాణించారు. 12.6 కి.మీ. పొడవైన ఈ మార్గం దేశ రాజధాని ఢిల్లీని నోయిడాతో కలుపుతోంది. ఇకపై దక్షిణ ఢిల్లీలోని కల్‌కాజీ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకూ మెట్రో రైలు పరుగులు తీయనుంది.
Samayam Telugu pm modi inaugurates delhi metros new magenta line takes ride with up cm
ఢిల్లీ మెట్రో మాజెంటా లైన్‌ను ప్రారంభించిన మోదీ


అయితే.. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆహ్వనించలేదు. ఢిల్లీలో మెట్రో కొత్త లైన్‌ ప్రారంభ కార్యక్రమాలకు కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడం ఇది మూడోసారి. ఈ మూడుసార్లూ ప్రధాని మోదీ హాజరవడం గమనార్హం. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్‌ పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఢిల్లీ ప్రభుత్వం కేటాయించిన నిధులను తిరిగిచ్చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ను పక్కనబెట్టడం, యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించడం.. బీజేపీ నేతల చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు.

ఈ ఏడాదిలో మోదీ మొత్తం 3 మెట్రోలను ప్రారంభించడం విశేషం. జూన్‌లో కొచ్చి మెట్రోను జాతికి అంకితం చేయగా.. నవంబర్‌లో హైదరాబాద్‌ మెట్రోను ఆవిష్కరించారు. తాజాగా ఢిల్లీ మెట్రోలోని మరో మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఒకే ఏడాదిలో 3 నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడం రికార్డు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.